దీనిని బట్టే అక్కడ మెగా అభిమానులకి ఈ మాత్రం కొదువ లేదు అనే చెప్పాలి. ఈ సారి పవన్ పార్టీ నుండి సుజ్జల అరవింద రాణి బరిలో ఉన్నారు. అయితే గెలిచిన అనంతరం ఆయన పీఆర్పీ పార్టీనీ వీడి వైసీపీ పార్టీలో కాటసాని రామిరెడ్డి చేరారు. 2014 లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన ప్రత్యర్థి అయిన టీడీపీ పార్టీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. బీసీ జనార్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గానికి మంచి అభివృధి పనులు చేపట్టారు అని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికార నేత చంద్రబాబును అడిగి నిధులు కేటాయించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచారని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈసారి కాటసాని రామిరెడ్డి కూడా ఎలాగైనా గెలవాలనే ఆకాంక్ష తో ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే వీరిద్దరికీ పార్టీ టికెట్ ఖరారు అయిపోయాయి. టీడీపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్ రెడ్డి కే పార్టీ టికెట్ ను కట్టబెట్టారు. ఇటు వైపు వైసీపీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి కే టికెట్ ఖరారు చేసారు. అటు వైపు ఈసారి ఈ నియోజకవర్గంలో తమ పాగా వేయాలని కాటసాని కసితో ఉన్నారు. సుజ్జాల అరవింద రాణి కూడా తనదైన శైలిలో ప్రచారం చేస్తూ జనాలను బాగా ఆకర్షిస్తున్నారు. ఇక్కడ మార్పు కోరి జనసేన పార్టీ గెలిచినా అవాక్కు కానక్కర్లేదు. కానీ జగన్ కు సీమలో ఉన్న ఫాలోయింగ్, కాటసాని రామిరెడ్డి కి ఉన్న పేరు కారణంగా ఈ సారి ఫ్యాన్ గాలికి ఏ పార్టీ తట్టుకొలేదు అని అంచనా.