లగడపాటి రెండు మార్లు వైఎస్సార్ వేవ్ లో ఎంపీ అయిన కాంగ్రెస్ నాయకుడు. ఆ తరువాత రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని అన్నారు కానీ రాజకీయ వూసు ధ్యాసా లేకుండా ఆయన గడపలేకపోతున్నారు. సర్వేల పేరుతో జనాల్లోకి వాస్తున్న లగడపాటికి తొలి పరాభవం తెలంగాణా ఎన్నికల సందర్భంగా జరిగింది. 


ఇక ఏపీలో జరుగుతున్న ఎన్నికలు, అదీ టీడీపీ అధినేత చంద్రబాబుతో చనువుగా ఉంటున్న లగడపాటికి బాబు గెలుపు చాలా అవసరం. అందువల్ల ఆయన సర్వే అటు తిరిగి ఇటు తిరిగీ టీడీపీ గెలుస్తుందనే చెబుతుంది. తిరుపతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అభివ్రుధి, సంక్షేమం కోరే ప్రభుత్వాన్ని జనం ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. అంటే ఆయన నర్మగర్భంగా టీడీపీ గెలుస్తుందని, గెలవాలని కోరుకున్నారన్నమాట.


ఇక అనుభవం కలిగిన వారినే జనం ఎన్నుకుంటారంటూ పరోక్ష సంకేతాలు కూడా లగడపాటి ఇచ్చారు. సర్వేల గురించి తాను ఇపుడే చెప్పనని మే 19న వెలువడుతాయని చెపుతున్న లగడపాటి వారి సర్వే ఆత్మ ఏమంటుందో, ఏమై ఉంటుందో  చెప్పకనే చెప్పేశారని సెటైర్లు పడుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణా ఎపిసోడ్ తరువాత లగడపాటి సర్వేలు ఇంకా జనం నమ్ముతారని అనుకుంటే పొరపాటేనేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: