ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో అందరి దృష్టి మంగళగిరి నియోజకవర్గం పై ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముద్దుల కుమారుడు నారా లోకేష్ మొట్టమొదటిసారి మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన రాజకీయ నేతలు మరియు ప్రజలు మంగళగిరి నియోజకవర్గంలో పోరు ఎలా ఉంటుందో అని ఆసక్తిగా గమనిస్తున్నారు.


అయితే ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. టిడిపి నుండి నారా లోకేష్ వైసీపీ పార్టీ నుండి ఆర్ కె పోటీపడుతున్నారు.


ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్ తడబడుతూ మాట్లాడుతూ సోషల్ మీడియాలో నవ్వుల పాలు అవుతున్న నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన కోడలు నారా బ్రాహ్మణి నీ కొడుకు తరపున ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దింపారు.


ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన నారా బ్రాహ్మణి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని రాబోయే ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ని గెలిపిస్తే మూడు నెలలలోనే ఈ నియోజక వర్గ రూపురేఖలు మారిపోతాయి అని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది మూడు నెలల్లో ఎలా చేస్తారు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: