ఇటీవల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసిపి పార్టీ అధినేత జగన్ మరియు టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో తెగ ఊదరగొట్టిన క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో పోలవరం విషయంలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్లు వేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు పక్క వారు బాగుపడితే సంతోషించే వ్యక్తులని నీలాగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే విధంగా లత్కోరు రాజకీయాలు చేయడం నాకు చేత కాదు అంటూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు కెసిఆర్.


అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మరియు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈనాడు కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు గానీ నేను గానీ అడ్డు పడిన సందర్భాలు లేవని చంద్రబాబు ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న అర్ధరహితమైన వ్యాఖ్యలు అంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడకూడదు అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: