ఎన్నికల తరువాత పార్టీ నాయకుల తీరును బట్టి వారి విజయావకాశాలను అంచనా వేయొచ్చు. ముందుగా జగన్ మాట్లాడుతూ..తమ పార్టీ విజయం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కబోతోందని జగన్ అన్నారు. అంతేగాక.. జగన్ ఎవరినీ నిందించలేదు. పోలింగ్ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు హింసను సృష్టించారని జగన్ అన్నారు.. నష్టపోయిన తమ వారికి సంఘీభావం ప్రకటించారు.


అంతేకానీ.. ఈసీని కాని మరెవరినీ జగన్ నిందించలేదు. ఇన్ని రోజులూ జగన్  పోలీసుల మీద అయినా విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే పోలింగ్ తర్వాత పోలిసుల మీద కూడా ఏ విమర్శలూ చేయలేదు.ఇక చంద్రబాబు విషయానికి వస్తే రెండో రోజు ఆయన యథారీతిన రెచ్చిపోయారు. ఒకవైపు తమ పార్టీకి నూటా ముప్పై సీట్లు వస్తాయని అంటూనే.. మరోవైపు 'అసలు ఇవి ఎన్నికలే కాదు.. ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలం అయ్యింది..' అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.


ఒకవైపు ఇవి ఎన్నికలే కాదంటూ.. మళ్లీ తన పార్టీ నూటా ముప్పై సీట్లు సాధిస్తుందని చంద్రబాబు నాయుడు అనడం.. ఆయనలోని అసహనాన్ని చాటుతూ ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి పోలింగ్ అనంతరం జగన్ కూడా టండా.. టండా .. కూల్.. కూల్ అన్నట్టుగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఈ వేడిని మరింత వేడెక్కించేలా సెగలు కక్కారు! 

మరింత సమాచారం తెలుసుకోండి: