ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బాలికలదే పైచేయి సాధించారు. పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్ధన్ రెడ్డి విడుదల చేశారు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా,34శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో జగిత్యాల చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.