జేడీ లక్ష్మి నారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు అసలైన కామెడీ చేస్తున్నాడు. ఐపీఎస్ గా ఉన్నప్పుడు ఉన్న పేరు రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలతో క్రెడిబిలిటీ పోగొట్టుకోవటం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అస‌లు విష‌యానికి వ‌స్తె రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా పోటీ వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌నే జ‌రిగింద‌న్న‌ది వాస్త‌వం.అన్ని స‌ర్వేలు కూడా వైసీపీ అధికారంలోకి వైసీపీ వ‌స్తుంద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీకి ప‌రిమితం అవుతుంద‌ని కోడై కూస్తుంటె జ‌న‌సేన పార్టీ మాత్రం మేము అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌క‌టించ‌డం హ‌స్యాస్ప‌దంగా ఉంది.


మ‌రో వైపు రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం అధికార తెలుగుదేశం, ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే అధికారం కోసం పోరు ఉంటుంది త‌ప్పించి మ‌రే పార్టీకి ఆ అవ‌కాశం లేదంటున్నారు. అయితే, జ‌న‌సేన పార్టీ నేత‌, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మాత్రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌దే అధికార‌మని, 88 సీట్లు వ‌స్తాయ‌ని వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.


పోలింగ్ పూర్త‌యిన త‌ర్వాత జ‌గ‌న్‌, బాబు ప్రెస్ మీట్లు పెట్టి ఊద‌ర‌గొట్టేస్తుంటె….జ‌న‌సేన అధ్య‌క్షుడు మాత్రం అజ్ణాతంలోకి వెల్లిపోయారు. పోలింగ్ స‌ర‌ళి, జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌నే ప్ర‌క‌టించ‌లేదు. అలాంటిది ల‌క్ష్మినారాయ‌ణ మాత్రం 88 సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించ‌డం చూస్తే పూర్తిగా బాబులాగా మారిపోయిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌కే లేని దుర‌ద ఈయ‌న‌కెందుకో…?

మరింత సమాచారం తెలుసుకోండి: