తెలుగుదేశం పార్టీ  ఓ వైపు గెలుపు ధీమా ఓ వైపు వ్యక్తం చేస్తూనే అన్ని రకాలుగా అధికారంలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ రాజకీయ చాణక్యాన్ని బాగానే వంటపట్టించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మైండ్ గేమ్  అన్న పదానికి అర్ధమూ పరమార్ధమూ  టీడీపీనే కూడా చెబుతారు. అటువంటి పార్టీ ఇపుడు సీఎం పీఠం పట్టేయాలనుకుంటోంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.


మెజారిటీ మాదేనని బయటకు ఎంతలా చెబుతున్న టీడీపీకి లోపల కలవరం అలాగే ఉంది. ఆ పార్టీకి కోస్తా జిల్లాలే బేస్. ఇక్కడ ఆ బేస్ ఏ కారణంగానైనా చెదిరితే పెద్ద దెబ్బ పడుతుందన్నది అందరికీ తెలిసిందే. దాంతో టీడీపీ ఇపుడు వివిధ రకాలైన ప్లాన్లతో ముందుకు పోతోంది. జనసేనకు కనీసం అరడజన్ సీట్లకు తక్కువగా రావని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. తమకు కచ్చితంగా బొటాబొటీ మెజారిటీ వస్తుందని కూడా నమ్ముతోంది. ఒకవేళ తగ్గి 80 సీట్లు వచ్చిన సర్కార్ ఏర్పాటు  చేస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది.


ఇందుకు జనసేన బలమే కారణం అంటున్నారు. జనసేనకు అయిదారు సీట్లు  వచ్చినా టీడీపీ ఖాతాలోనే వేసుకోవాలి. ఆ విధంగా 86 సీట్లకు చేరువ అయ్యేందుకు వీలవుతుంది. అపుడు మ్యాజిక్ ఫిగర్ కి రెండు తక్కువ పడతాయి. ఇపుడు మరో ప్లాన్ రెడీ చేసిపెట్టుకుంటున్నారు. వైసీపీ నేతలకు టచ్ లో ఉండమని కూడా ఆదేశాలు లోపాయికారిగా తమ్ముళ్ళకు వెళ్ళాయని అంటున్నారు. అంటే ఆరు నూరు చేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ ఎత్తుగడగా ఉందని అంటున్నారు. మరి చూడాలి ఎంతవరకూ హిట్ అవుతారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: