ఏపీలో ఎవరు గెలుస్తారన్నది ఇపుడు హాట్ టాపిక్. ఏ నలుగురు కలసినా ఎవరు కాబోయే సీఎం. ఇదీ చర్చగా ఉంది. చంద్రబాబు మళ్లీ వస్తారా. లేక జగన్ సీఎం అవుతారా ఇదే డిస్కషన్. దీని మీద ఏ సర్వే వచ్చినా, నివేదిక అని చెప్పినా కూడా జనంలో అమితాసక్తి కనిపిస్తోంది. ఇక అన్ని రకాలుగా యంత్రాంగం అందుబాటులో ఉన్న ఓ పార్టీ ఏపీలో పొస్ట్ పోల్ పై తమదైన నివేదిక సిధ్ధం చేసుకుందట.


జాతీయ పార్టీ బీజేపీ నివేదిక ప్రకారం ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందట. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఎల్ నరసిమ్హారావు ఓ తెలుగు చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో కచ్చితంగా చంద్రబాబు ఓడిపోతున్నరని చెప్పేశారు. ఈ మేరకు తమ వద్ద నివేదికలు ఉన్నాయని కూడా వెల్లడించారు. బాబు విషయంలో తాము మళ్ళీ వెనక్కు వెళ్ళేది లేదని, పొత్త్లు పెట్టుకునే ప్రసక్తే లేదని కూడా కుండ బద్దలు కొట్టారు. అసలు పొత్తుల అవసరం పడే సీట్లు బాబుకు ఎక్కడ నుంచి వస్తాయని కూడా జీవీఎల్ ప్రశ్నించడం విశేషం.


అదే విధంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీతోనే తాము పోరాడుతామని కూడా జీవెల్ క్లారిటీ ఇచ్చారు. ఇక రేపటి రోజున ఢిల్లీలో మరో  మారు అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని కూడా జీవీఎల్ కచ్చితంగా చెప్పారు. తమకు ఎవరి అవసరం ఏర్పడకుండా పూర్తి మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు.



తెలంగాణాతో పాటు, తమిళనాడు, ఒడిషా, కర్నాటక. పశ్చిమ బెంగాల్, అస్సాం, యూపీల్లో తమకు అధిక సీట్లు దక్కుతాయని జీవీఎల్ విశ్లేషించారు. మొత్తానికి జీవీఎల్ చెప్పిన మాటలను బట్టి ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమనే భావించాలి. తాను పక్కా ఆధారాలతో చెబుతున్నానని, గతంలో   రెండున్నర దశాబ్దాల పాటు ఎన్నికల  సర్వేలు చేసిన అనుభవం కూడా  తనకు   ఉందని జీవీఎల్ చెప్పడంతో ఆయన మాటలు నమ్మాల్సివస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: