యాదాద్రి జిల్లా బొమ్మ‌ల‌రామారం మండ‌లంలో దారుణం జ‌రిగింది. స్పెష‌ల్ క్లాసులున్నాయ‌ని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక బావిలో శ‌వ‌మై క‌నిపించింది. పాముల న‌ర్సింహులు కూతురు పాల‌ముల శ్రావ‌ణి మేడ్చ‌ల్ జిల్లా కీస‌ర మండ‌లంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చ‌దువుకుంటోంది. 14 ఏళ్ల బాలిక తాజాగా 9 వ త‌ర‌గ‌తి పూర్తి చేసుకుని ప‌దో త‌ర‌గ‌తి చేరుకుంది. స్పెష‌ల్ క్లాసులున్నాయ‌ని చెప్పి వెళ్లిన శ్రావ‌ణి శ‌వ‌మైని క‌నిపించింది. 

గంట‌లు గ‌డిచాయి.. రోజు వ‌చ్చే స‌మ‌యం కూడా దాటింది. దీంతో ఆందోళ‌న‌కు గురైన త‌ల్లిదండ్రులు బాలిక కోసం ఆరా తీశారు. ఎంత‌కు ఆమే ఆచూకి ల‌భించ‌క‌. పోవ‌డంతో చివ‌ర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు గా న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఇంట్లో నుంచి వ‌ళ్లిన శ్రావ‌ణి శ‌వ‌మై క‌నిపించింది. 

అయితే హ‌జీపూర్‌లోని గ్రామ శివారులోని బావి వ‌ద్ద ఆమె స్కూల్ బ్యాగ్ ల‌భించింది. దీంతో చుట్టుప‌క్క‌ల వెతికి చూశారు. దీంతో బావి ద‌గ్గ‌ర తొవ్విన గుర్తులు క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో బాలిక‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేసి బావిలో పూడ్చిపెట్టిన‌ట్ట స్థానికులు గుర్తించారు. అటు శ్రావ‌ణి మ‌ర‌ణ వార్త విన్న ఆమె కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌వుత‌న్నారు. 

దీంతో స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. అయితే బావిలో శ్రావ‌ణి స్కూల్ బ్యాగ్ తో పాటు బావి ప‌క్క‌న మ‌ద్యం బాటిళ్లు క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో బాలిక‌పై అత్యాచారం చేసి హ‌త్య చేసి ఉంటారా.. లేక కావాల‌ని చేశారా అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీంతో డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీమ్‌లు రంగంలోకి దిగాయి.  మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: