గత ఆదివారం ఈస్టర్ సండే రోజున ఉగ్రదాడుల దారుణానికి పాల్పపడ్డారు.  వరుసగా చర్చీ, హూటళ్లలో బాంబు దాడులకు పాల్పపడ్డారు. ఈ దాడుల్లో సుమారుగా 320 మందికి పైగా మరణించారు.  అంతటితో ఆగకుండా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి.  కొన్ని చోట్లు బాంబు నిర్వీర్యం చేశారు పోలీసులు. 


అయితే శ్రీలంకలోకి కొంత మంది తీవ్ర వాదులు ప్రవేశించారని తెలుసుకొన్ని సైన్యం వారిని మట్టు పెట్టేందుకు రంగంలొకి దిగింది.   ఈ క్రమంలో శ్రీలంక తూర్పు తీరంలో శుక్రవారం రాత్రంతా అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులతో జరిగిన భీకర్ ఎన్‌కౌంటర్‌లో 15 మంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు సైన్యం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 


అంపారాలోని సైంతమరుథులో శుక్రవారం సాయంత్రం అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రాత్రంతా కొనసాగినట్టు ఆయన తెలిపారు.  ఓ ఇంటిలో దాక్కున్న ఉగ్రవాదులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వచేశారని, చట్టుముట్టినప్పుడు దాడికి పాల్పడ్డారని, దీంతో తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.


హతమైన ఉగ్రవాదులు నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే) సభ్యులుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 76 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సిరియా, ఈజిప్ట్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. గత ఆదివారం చర్చిలపై దాడులకు పాల్పడింది కూడా తౌహీద్ జమాత్ (ఎన్‌టీజే)  అనుమానిస్తున్నారు. కాగా, పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్న 140 మంది కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: