ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయంలో పక్కా కాన్ఫిడెన్స్ తో వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సారి ఎన్నడూ లేనంతగా ఓటింగ్ ఏపీలో జరగటంతో ఫలితాలపై చాలా ఉత్కంఠభరితంగా ఉన్నారు ఏపీ ప్రజానీకం. ఈ నేపథ్యంలో మే 23 వ తారీఖున ఫలితాలు వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీలో భయం నెలకొన్నట్టు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

Image result for YSRCP BUGGANA

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు లోనే సొంత పార్టీ నాయకులే అంతర్గత సమావేశాల్లో సమీక్ష కార్యక్రమాలలో ఓటమి తప్పదని కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాబోతున్న ఓటమిని తప్పించుకోవడం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు ఈవీఎంలపై మరియు ఎన్నికల కమిషన్ పై రకరకాల ఆరోపణలు చేస్తున్నారని..చంద్రబాబుకు ఓటమి తప్పదని తెలిసిపోయిందని తాజాగా ఎన్నికల కమిషన్పై మరియు వివిధ రాష్ట్రాలలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానం చూస్తూనే తెలిసిపోతుందని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు.

Image result for YSRCP BUGGANA

ఈ క్రమంలో విజయం తమదే అన్నట్లుగా ఉంటున్న వైసీపీ పార్టీకి చెందిన నాయకులు..జగన్ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా జగన్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజమో తెలియాలంటే మే 23 వ తారీకు వరకు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: