న‌గ‌ర శివారులో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వ‌న‌స్త‌లిపురంలోని ఆటోన‌గ‌ర్‌లో భార్య‌, కుమారుడ్ని అతి దారుణంగా హ‌త్య చేశాడో వ్య‌క్తి. అంతే కాదు హ‌త్య చేసిన త‌ర్వాత డ్ర‌మ్ములో ప‌డేశాడు. అనంత‌రం ఇంటికి తాళం వేసి ప‌రార‌య్యాడు. అయితే ఇంట్లో దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో అది గ‌మ‌నించిన స్తానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో విష‌యం తెలుసుకున్న పోలీసులు.. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకొచ్చింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 


బీహార్‌కు చెందిన ఆదిబ్ జ‌న‌గామ జిల్లా మన్సూరాబాద్‌కు చెందిన కవితతో ప‌రిచ‌యం అయ్యింది. అది కాస్త ప్రేమ‌గా మారింది. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం ఆటోన‌గ‌ర్‌లోని విజ‌య శ్రీ కాల‌నీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆదిబ్ ఇంటికి తాళం వేసి బ‌య‌ట‌కు వెళ్లాడు. మ‌ళ్లీ తిరిగి రాలేదు. ఇంట్లో నుంచి దుర్వాస‌న వ‌చ్చింది. 


దుర్వాస‌న రావ‌డంతో ఇంటి య‌జ‌మానికి అనుమానంతో వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి ఇంటి త‌లుపులు ప‌గుల‌గొట్టి లోప‌లికి వెళ్లారు. ఇంటిని మొత్తం ప‌రిశీలించారు. ఇంట్లో నీటి డ్ర‌మ్ములో ఆదిబ్ భార్య క‌విత‌, రెండేళ్ల కుమారుడు ఇమ్రాన్‌ల మృత‌దేహాలు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆదిబ్ హైద‌రాబాద్ నుంచి చెక్కేసిన‌ట్లు గుర్తించిన పోలీసులు అత‌డు నాగ్‌పూర్‌లో ఉన్న‌ట్లు గుర్తించారు. ఆదిబ్ కోసం రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: