హైదరాబాద్లో గన్ కల్చర్ విస్తృతి పెరుగుతోందా? అక్రమార్కులు దర్జాగా ఆయుధారలతో సంచరిస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా నగరంలో ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటన హైదరాబాద్ వాసులకు వణుకు పుట్టిస్తోంది. పంజాగుట్టలో ఆర్టీసీ బస్సులో ఫైరింగ్ జరగడంతో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు.
పంజాగుట్ట వద్దకు చేరిన ఓ బస్లోని ప్రయాణికుడిని తోటి ప్రయాణికులు స్టాప్ వచ్చినందున బస్ దిగాలని కోరారు. అయితే ఆయన వారితో వాగ్వాదం పెంచుకున్నాడు. బస్సు దిగకుండా ఆ ఆగంతకుడు ఒకరిపై కాల్పులు జరిపాడు. సఫారీ డ్రెస్లో ఉన్న వ్యక్తి కాల్పులతో ప్రయాణికులు ఆందోళన చెందారు. బస్సులో గందరగోళం నెలకొంది. అయితే, ఇంత జరిగినా బస్ ఆపకుండానే డ్రైవర్ వెళ్లిపోవడం కలకలం రేకెత్తించింది.
ఇదిలాఉండగా, కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు బస్సు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఈ మేరకు గుర్తు తెలియన వ్యక్తి వివరాలు ఆరాతీస్తున్నారు. ప్రయాణికులు చెప్పిన అంశాల ఆధారంగా ఆర్టీసీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి దర్యాప్తు చేయనున్న్టలు తెలుస్తోంది.