తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రంగారెడ్డి మొయినాబాద్ మండలం హజీజ్నగర్లోని 111 నంబర్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచింది.ఒక గ్రామానికి చెందిన బ్యాలెట్ పత్రాలు మరో గ్రామానికి చేరడంతో గందరగోళం నెలకొంది.
దీంతో అధికారులు ఇక్కడా కాసేపు పోలింగ్ నిలిపివేశారు. మరోవైపు ఇదే కారణంతో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్ నిలిచింది. జనగామకు చెందిన బ్యాలెట్ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.