హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి జంట హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపాయి. రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో అర్ధ‌రాత్రి జంట హ‌త్య‌లు జ‌రిగాయి. పాత‌బ‌స్తీలోని ప‌ట్టేప‌ల్లిలో అత్తాకోడ‌లును గుర్తు తెలియ‌ని దుండ‌గులు దారుణంగా హ‌త‌మార్చారు. దీంతో మైలార్ దేవ్‌ప‌ల్లి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


అత్తా ఫ‌బీహ బేగం, కోడ‌లు త‌య్యబా బేగంల‌ను త‌ల్వార్ల‌తో అత్యంత దారుణంగా దుండ‌గులు న‌రికి చంపారు. ఇద్ద‌రిని చంపిన త‌ర్వాత దుండ‌గులు పారిపోయారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే రంగంలో దిగారు. అక్క‌డ దొరికిన క్లూస్ ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


అయితే త‌మ‌కు ఎవ‌రితో శ‌తృత్వం లేద‌ని, ఎవ‌రు హ‌త్య చేశారో తెలియ‌ద‌ని మృతుల కుటుంబ స‌భ్యులు, బంధువుల చెబుతున్నారు. ఇద్ద‌రిని హ‌త్య చేయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికుంద‌ని వాపోతున్నారు. ఇద్ద‌రిని హ‌త్య చేయ‌డంతో క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు కుటుంబ స‌భ్యులు. హ‌త్య జ‌రిగిన ప్రాంతంలో దొరికిన క్లూస్ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దుండ‌గుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: