అనుమానం పెను భూతమైతే ఎలా ఉంటుందో ఓ శాడిస్టు భర్త చేసి చూపించాడు. కేవలం అనుమానంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. తను కొట్టడమే కాకుండా అన్నదమ్ములతో కలిసి దాష్టికానికి పాల్పడ్డాడు. భార్యను తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం పెట్టి, చర్మం చిట్లిపోయే విధంగా దాడికి పాల్పడ్డాడు. అయితే వారి వద్ద నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది ఆ భార్య.. అయినా వదిలిపెట్టలేదు ఆ రాక్షసులు. ఆమెను బంధించి మరీ టార్చర్ చూపించారు.
సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన రామలింగయ్యకు ఐదేళ్ల క్రితం చివ్వెం మండలానికి చెందిన గౌతమితో వివాహం జరిగింది. కొంత కాలం సాఫీగా సాగింది వీరి సంసారం. అయితే ఏం జరిగిందో ఏమో.. ఇక భార్యపై అనుమానం పెంచుకున్నాడు శాడిస్టు భర్త. భార్యపై అనుమానంతో నిత్యం భర్తతో గొడవలు జరిగేవి. పెద్ద మనుషుల పంచాయితీ పెట్టి నచ్చచెప్పడంతో భర్తతో సర్దుకుపోయింది గౌతమి.
అయితే మొన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో పరాయి వ్యక్తులతో మాట్లాడుతుందనే నెపంతో తన అన్నలు నర్సయ్య, ముత్తయ్యలతో కలిసి గౌతమిని తాళ్లతో కట్టేశారు. అంతే కాదు చిత్ర హింసలు పెట్టారు. రాక్షసఖాండ ఎలా జరిగిందో బాధితురాలికి చూపించాడు. ఆరుగంటల పాటు తనను చిత్రహింసలకు గురి చేశారని గౌతమి తెలిపింది. విషయం తల్లి స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.