లండన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో కత్తితో పొడిచి దారుణంగా చంపాడో శాడిస్టు భర్త. ఆమెపై కత్తితో ఏకంగా 59 సార్లు అతి కిరాతంగా పొడిచి చంపాడు. గతేడాది ఈ దారుణ సంఘటనపై లండన్ కోర్టులో విచారణ జరిగింది. నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ కేసు విషయాలు విన్న న్యాయమూర్తి షాక్కు గురయ్యారు.
కాగా.. భారత సంతతికి చెందిన ఏంజెలా మిట్టల్ తన భర్త లారెన్స్ బ్రాండ్తో కలిసి లండన్లో ఉండేది. కాగా గతేడాది క్రిస్మస్ పర్వదినం రోజున భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఒకరిని ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన లారెన్స్ కత్తితో భార్యను గట్టిగా పొడిచాడు.
అంతేకాడు అతడి కోసం చల్లారలేదు. చనిపోయే వరకు శరీరంలో పొడుస్తూనే ఉన్నాడు. పొడుస్తూనే ఉన్నాడు. పొడుస్తూనే ఉన్నాడు.. ఆ కత్తి విరిగిపోతే .. ఇంకో కత్తి తీసుకోని పొడుస్తూనే ఉన్నాడు. ఆమె చనిపోయేంత వరకు కసితీరా పొడిచాడు దుర్మార్గుడు. చివరకు రక్త స్రావంతో ఏంజెలా చనిపోయింది. ఆ తర్వాత లారెన్స్ తన భార్యను హత్య చేశానంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. తానే పోలీసులకు లొంగిపోయాడు.
ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైల్లో నెట్టేశారు. కేసు దర్యాప్తులో తెలిసిన విషయాలతో అధికారులందరూ ఒక్కసారిగా ముక్కుమీద వేలేసుకున్నారు. లారెన్స్ తన భార్యను 59సార్లు పొడిచినట్లు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ కేసు విచారించిన న్యాయమూర్తి కూడా విచారణలో భాగంగా నిందితుడిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇంత దారుణమా.. ఇదెక్కడ్నుంచి వచ్చిందని.. ఒక కత్తి ఇరిగిపోతే మరో కత్తి తీసుకొచ్చి పొడిచావంటే ఆ టైమ్లో ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయమూర్తి. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. కోర్టు లారెన్స్కు జీవితఖైదు విధించడంతో ఏంజెలా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.