చంద్రబాబు ఓటమి ఖాయమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తెల్చేశాయి. అయితే బాబుతో పాటు కూటమి కూడా ఓటమి ఖాయమని చెబుతున్నారు. యూపీలో మహాఘట్ బంధన్ చిత్తు చిత్తు కానుంది. కర్ణాటకలో జేడీఎస్ ఖాతా తెరవడం కూడా కష్టంగా ఉంది! కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ విజయం కూడా కష్టంగానే ఉంది! ఇవీ.. ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్న సంచలనాలు! పశ్చిమబెంగాల్ లో భారతీయ జనతా పార్టీ 20 ఎంపీ సీట్ల వరకూ సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి!


మమతా బెనర్జీ  పార్టీకి సమానమైన స్థాయిలో బీజేపీ అక్కడ పాగా వేయనుందని చెబుతున్నాయి. ఎస్పీ-బీఎస్పీలు అయితే చేతులు కలిపాయి కానీ.. ఓట్లు మాత్రం కలవలేదు అని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. యూపీలో చిత్తు అవుతుందని ప్రీ  పోల్ అంచనాల్లో చెప్పిన మీడియా సంస్థలే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం కమలం పార్టీ ఒక్క యూపీలోనే 60 కి పైగా ఎంపీ సీట్లు సాధించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఎస్పీ-బీఎస్పీలు  కలిసి 18-20 ఎంపీ సీట్లు కూడా కష్టమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.


ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉండటం విశేషం. స్థూలంగా చంద్రబాబు నాయుడి దోస్తులంతా చిత్తు చిత్తుగా ఓడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. గత పర్యాయంతో పోలిస్తే మరింత భారీ మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి! మరి అసలు ఫలితాలు ఎలా ఉంటాయో వచ్చే గురువారంతో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: