ఎగ్టిట్ పోల్ కాదు కానీ చంద్రబాబు పరువు ఢిల్లీలో పోతోంది. నిన్నటి వరకూ ఎలాగోలా మ్యానేజ్ చేసుకొచ్చిన బాబుకు ఎగ్టిట్ పోల్ సర్వే ఫలితాలు టీడీపీ ఏంటో చూపించేశాయి. బాబు ఓడిపోతాటండే పక్కనున్న డీఎంకే స్టాలిన్ కూడా నమ్మలేని విధంగా పాలిటిక్స్ చేస్తూ కధ నడిపారు.


అయితే ఇపుడు ఎగ్టిట్ పోల్ సర్వే మొత్తం తెర తొలగించేసింది. ఏపీలో టీడీపీ సీన్ ఇది అని మొత్తం దేశానికి చాటి చెప్పేసింది. దాంతో చంద్రబాబు ఇపుడు అమరావతి గుమ్మం దాటే పరిస్థితి ఉందా అని సెటైర్లు పడుతున్నయి. ఇక ఎగ్టిట్ సర్వేల వల్ల ఏర్పడిన నష్టాలకు ప్యాచ్ వర్క్ చేసుకుంటున్న బాబుకు ఇపుడు శివసేన నుంచి ఘాటు పంచులు పడుతున్నాయి. 


ఏపీలో బాబు ఓడిపోతున్నారని, అలాంటి బాబు ఢిల్లీలో కూటమి పేరుతో హడావుడి చేయడమేంటని ఈ రోజు శివసేన తన సామ్నా పత్రికలో గట్టిగా నిలదీసింది. ఏపీలో జగన్ భాయ్ దూసుకెళ్తున్నాడని,, అక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు లేవంటే లేవని ఆ పత్రిక బల్ల గుద్ది మరీ చెప్పేసింది. మరి చంద్రబాబు ఎలాంటి ప్రయోజనాలు లేకుండా కూటమి కోసం ఎందుకంత ప్రయత్నాలు చేస్తున్నారని కూడా శివసేన ప్రశ్నించింది. మొత్తానికి చూసుకుంటే చంద్రబాబు గాలి తీసేస్తున్నారంతా కలసి.



మరింత సమాచారం తెలుసుకోండి: