రాజకీయ సర్వేశ్వరుడిగా లగడపాటి రాజగోపాల్ బాగా పాపులారిటీ సంపాదించారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. అయినా కూడా అంతకు మించిన  పలుకుబడి ఆయనకు సర్వేల్లోనే రావడం జరిగింది. ఆంధ్రా ఆక్టోపస్ అన్న బిరుదు కూడా ఆయన సంపాదించుకున్నారు. 


ఇక లేటెస్ట్ గా లగడపాటి సర్వే ఒకటి విడుదల చేశాడు. అందులో టీడీపీ విజయం ఖాయమని తేల్చేశాడు. అయితే ఇక్కడే వైసీపీ వారికి మండుకొస్తోంది. సరిగ్గా తెలంగాణాలోనూ ఇలాగే లగడపాటి చేశారు, ఇపుడు ఏపీలోనూ గెలుపు గుర్రం ఓ వైపు అని అంతా అంటే లగడపాటి బాబు పేరు చెప్పడమేంటి అని గుస్సా మీదున్నారు. ఇక విజయసాయిరెడ్డి అయితే ఎల్లో జలగ లగడపాటి అనేశారు.


దీనిపైన లగడపాటి రియాక్ట్ అవుతూ తనకు టీడీపీ కంటే వైసీపీలోనే మిత్రులు ఉన్నారని చెప్పారు. పైగా తనకు బాబు కంటే కూడా జగన్ బాగా సన్నిహితుడని కామెంట్స్ చేశారు. వైఎస్ కుటుంబంతో తన అనుబంధం చాలా గొప్పదని, ఇక జగన్ తనకు ఉన్న రిలేషన్ పూర్తిగా పర్సనల్ అంటూ పేర్కొన్నారు. మొత్తానికి లగడపాటి తనవైన వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ బాబు కంటే వైఎస్ కుటుంబమే ఎక్కువ అని చెప్పడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: