ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలతో పెరిగిపోయిన వేడి చల్లారక ముందే ఇండియా టుడే మరో ఫలితం వెల్లడించింది.  మొన్న జరిగిన ఎన్నికల్లో వైసిపికి రాబోయే ఎంపి సీట్లేతో  జాబితాతో సహా వెల్లడించింది. ఇండియా టుడే వెల్లడించిన లెక్క ప్రకారం వైసిపికి కచ్చితంగా 18 ఎంపి సీట్లు వస్తాయట. మిగిలిన సీట్లు వైసిపి-టిడిపి మధ్య హోరా హోరీగా సాగింది కాబట్టి గెలుపు తేల్చటం కష్టమైందట. అలాగే  ఒక సీటులో వైసిపి-జనసేన మధ్య గట్టి పోటీ జరిగిందని చెప్పింది.

 

ఇండియా టుడే తాజా ఫలితాలతో టిడిపిలో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది. ఇండియా టు డే వెల్లడించిన జాబితా ప్రకారం విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, అమలాపురం, హిందుపురం, నరసరావుపేట, రాజంపేట, నంద్యాల, కర్నూలు, బాపట్ల, ఏలూరు,  రాజమండ్రి, ఒంగోలు, నర్సాపురం, కడప, నెల్లూరు, తిరుపతి లోక్ సభ స్ధానాల్లో వైసిపి విజయం ఖాయమట.

 

అలాగే చిత్తూరు, మచిలీపట్న, గుంటూరు, విజయవాడ, అనంతపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో వైసిపి-టిడిపి మధ్య హోరా హోరీగా నడిచిందట పోటి. ఇక మిగిలిన విశాఖపట్నం నియోజకవర్గంలో పోటీ వైసిపి-జనసేన మధ్య గట్టిగా జరిగిందట. అంటే ఇండియా టు డే లెక్కల ప్రకారం వైసిపికి 18 సీట్లు ఖాయం. టిడిపికి ఒక్క సీటు కూడా ఖాయం అని చెప్పేందుకు లేదు. కాకపోతే టైట్ ఫైట్ నడిచిన 6 నియోజకవర్గాల్లో ఎక్కడైనా గెలుస్తుందేమో చూడాలి. అలాగే జనసేన కూడా ఒక స్ధానంలో మంచి ఫైట్ ఇచ్చింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: