ప్రజాశాంతి అధినేత కే. ఏ పాల్ ఎన్నికల ముందు ఎన్నికలయ్యాక రోజు టీవీలో కనపడుతూ తెగ హడావిడి చేశారు.  కాని కౌంటింగ్ రోజు ఆయన, ఆయన స్థాపించిన ప్రజాశాంతి పార్టీ రెండు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. తాను ఎంటో ఎన్నికలయ్యాక చూపిస్తానన్న పాల్ నిజంగానే తను ఎంటో చూపించాడు.

 

కే. ఏ పాల్ నరసాపురం ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు.అక్కడ ఆయనకు ఇప్పటి వరకు 80 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఎన్నికలు పూర్తి అయ్యేసరికి ఆయన సాధించిన ఓట్ల సంఖ్య పెరగకపోతే ఎవరిని వదలని సోషల్ మీడియా ఆయనను కూడా వదలకుండా ఆడుకుంటుంది.

 

నేనే ఆంధ్రప్రదేశ్ సీఎం అని ఛానెల్ లో ప్రమాణస్వీకారం చేసిన పాల్ గారు కనీసం తను పోటీ చేసిన దగ్గర డిపాజిట్ లైన సాధిస్తారా? అంటే అనుమానమే అనే చెప్పాలి.ఇప్పటికే వైసీపీ కౌంటింగ్ ని ఏకపక్షం చేసేసి దాదాపు విజయాన్ని ఖరారు చేసుకుంది.అధికార నిర్ణయం కోసం ఏ పార్టీ ఎన్ని స్థానాలలో  గెలిచిందో తెలుసుకోవడానికి మరి కొన్ని గంటలు వేచి ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: