ఎన్నిక‌ల తుది ఫ‌లితాలు వెలువ‌డ‌న‌ప్ప‌టికీ...ఫ‌లితాల విష‌యంలో పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చిన నేప‌థ్యంలో....తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. మోడీకి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలుప‌గా...జ‌గ‌న్‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.


లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అద్భుత విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజల దీవెనల రూపంలో జగన్ కష్టం ఫలించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 
సోదర రాష్ట్ర పరిపాలనలో మంచి జరగాలని కేటీఆర్ ఆశించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: