జగన్ గ్రాండ్ విక్టరీ దిశగా పయనిస్తున్నారు. ఆయన పదేళ్ల కష్టానికి జనం ఘనమైన తీర్పు ఇచ్చారు. అసలు అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటుందా అన్న తీరున జగన్ ప్రభంజనం సాగింది. జగన్ నామస్మరణతో  ఈవీఎంలు తరిస్తున్నాయి. జగన్ గెలుపు సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.



ఎపి అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు ఇలా ఉంటాయని తాము ముందుగానే ఊహించామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఆయన ఎన్నికల ఫలితాలను ఈ రోజు టివీలలో చూస్తూ గడిపారు. ఈ సందర్భంగా ఒక ఆంగ్ల చానల్ తో ఆయన మాట్లాడారు.తాను ఈ ఫలితాలను ఊహించానని ఆయన అన్నారు. 


తమ ఎజెండా అయిన ప్రత్యేక హోదాకు కట్టుబడి ,దాని సాదనకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.కాగా రాహుల్ గాందీ పై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఇప్పుడు ఏమీ మాట్లాడనని ఆయన అన్నారు. మొత్తానికి జగన్ కూల్ గా ఉంటూ తనదైన శైలిని ప్రత్యర్ధులకు చూపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: