2019 సార్వత్రిక
ఎన్నికల కౌంటింగ్ లో అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోను ఫలితాలు ఏకపక్షమైపోయాయి.
ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి అని ఆశించి శపధాలు చేసిన రాజకీయ నాయకులు అందరూ
ఏకపక్ష ఫలితాల గురించి సాయంత్రం మీడియాతో మాట్లాడడానికి కి కారణాలు వెతుక్కుంటున్నారు.
ఈ ఎన్నికలలో తాము ప్రభావం చూపుతాం అని చెప్పిన జనసేన కూడా వైసీపీ ఫ్యాన్ వేగానికి అడ్డుకట్ట వేయలేక పోయింది.ఇదే విధంగా ప్రాంతీయ పార్టీల తో తాము ఈసారి యుపిఎ 3 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ కూడా బీజేపీ పవనాన్ని ఆపలేక డీలా పడింది.
అటు రాష్ట్రంలోనూ ఇటు జాతీయ స్థాయిలో ను రెండు పార్టీలు తమ ప్రత్యర్థులను కోలుకోలేనంతగా చిత్తు చేశాయి.అటు వైసీపీ,ఇటు బీజేపీని విజయం వరించనున్నది. కాని ఖచ్చితంగా ఎన్ని స్థానాలలో గెలుస్తారో అనే సంఖ్య కోసం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆగాల్సిందే.