సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓటమి దాదాపుగా ఖాయమైంది. ఇప్పటికి పదకొండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి  మంత్రి అయ్యన్నపాత్రుడి మీద 15 వేల ఓట్ల  మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి పెట్ల ఉమా శంకర్ దూసుకుపోతున్నారు.


 గత ఎన్నికలలో కేవలం రెండు వేల ఓట్లతో ఆయన ఓడిపోయారు. నాటి నుంచి కూడా పెట్ల నియోజకవర్గంలో తిరుగుతూ పట్టు పెంచుకున్నారు. కాగా తాజా ఎన్నికల్లో అయ్యన్న ఓటమి అంచున పయనిస్తున్నారు. ఈసారి భారీ మెజారిటీతో పెట్ల నర్శీపట్నంలో జెండా పాతే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అయ్యన్న కనుక ఓటమి పాలు అయితే ఇప్పటికి ముచ్చటగా మూడుసార్లు ఓటమిపాలు అయినట్లు అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: