మూడు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌ట‌న్న వైసీపీ స‌వాల్ విసిరారు. తొడ‌లు కొట్టి మ‌రీ వైసీపీపై విరుచుకుప‌డ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని త‌ప్పు.. టీడీపీయే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తొడ‌గొట్టి మ‌రీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న తెగ‌ హ‌డావిడి చేశారు. అంతేకాదండోయ్‌.. టీడీపీ 130 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని అన్నారు. ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ కు మూడు రోజుల ముందు బుద్దా వెంక‌న్న ఇలా అన్నారు. క‌ట్ చేస్తే.. సీన్ రివ‌ర్స్ అయ్యింది. వైసీపీ విజ‌యంతో భారీ అధిక్యంతో ముందుకు దూసుకు పోయింది. 


ఫ‌లితాల్లో టీడీపీకి ఎదురు దెబ్బ త‌గిలింది. వైసీపీ దెబ్బ‌తో టీడీపీకి సునామీ దుసుకొచ్చింది. ఒక్క‌సారిగా ప్ర‌జ‌ల దెబ్బ‌కు టీడీపీ కుప్ప‌కూలిపోయింది. ఇంకేముందుకు వైసీపీ వెంక‌న్న‌ను ఒక ఆట ఆటుకుంటోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై ట్రోలింగ్‌.. సెటైర్ల ప‌ర్వం మొద‌లైంది. 


తొడ‌లు కొట్టిన బుద్దా వెంక‌న్న‌ను టార్గెట్ చేశారు నెటిజ‌న్లు. ఓ వైసీపీ కార్య‌క‌ర్త అయితే ఏకంగా తొడ కొట్టాల్సింది అప్పుడు కాదు తొడ‌కొట్ట‌డం అంటూ కొట్టి మ‌రీ చూపించాడు. మరోక‌రైతూ వెంక‌న్న మ‌రో బండ్ల గణేష్ కాబోతున్నారంటూ సెటైర్లు వేసుకున్నారు. 


కాగా.. తొడ‌లు కొట్టి స‌వాలు విసిరిన బుద్ద వెంక‌న్న‌కు ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ పెద్ద షాక్ ఇచ్చాయి. చూడాలి మ‌రి టీడీపీ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేసిన బుద్దా స్పంద‌న ఎలా ఉండ‌బోతోందో. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌విస్తారా..?  లేక ఏదో పొర‌పాటున అన్నాం లేండీ అంటూ ఊరుకుంటారా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. ఏది ఏమైనా.. బుద్దా వెంక‌న్న ఏలా స్పందిస్తారో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: