సినీ ప‌రిశ్ర‌మ అంటే ఉండే క్రేజ్‌...ఆ రంగంలోని స్టార్లంటే ఉండే ఆరాధ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వేదిక ఏదైనా...వారికి ఉండే ఆరాధ‌న ప్ర‌త్యేకం. అయితే, అలాంటి సెల‌బ్రిటీల‌కు 2019 లోక్‌స‌భ ఎన్నిక‌లు షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నిక‌ల‌లో సినీ గ్లామ‌ర్ ఏ మాత్రం ప‌ని చేయ‌లేదు. సినిమాలు వేరు రాజ‌కీయం వేరు అనే నానుడి స‌రిగ్గా సెట్ అయిన‌ట్టు కొంద‌రు సెల‌బ్రిటీలు నిరూపించారు. తెలుగురాష్ట్రాల నుంచి మొద‌లుకొని...ఢిల్లీ వ‌ర‌కు ఇదే ఒర‌వడి స్ప‌ష్ట‌మైంది.


ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ గాజువాక‌, భీమవ‌రం నుండి పోటీ చేయ‌గా ఆ రెండు స్థానాల‌లో ఆయ‌న ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. పార్టీ ప‌రంగా చూసుకుంటే....ఒక్క‌టంటే ఒక్క స్థానంలో మాత్ర‌మే జ‌న‌సేన గెలుపొందింది. ఇక ప‌వన్ సోద‌రుడు నాగబాబు న‌ర‌సాపురం లోక్‌స‌భ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌గా అక్క‌డ ఆయ‌న‌కి ఓటమి త‌ప్పలేదు. ఇక ప్ర‌ముఖ నిర్మాత పొట్లూరి వి విర‌ప్ర‌సాద్ విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానం నుండి పోటీ చేయ‌గా, ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. యంగ్ హీరోయిన్ మాధ‌వి లత బీజేపీ నుండి పోటీ చేయ‌గా ఆమె కూడా ఓట‌మి పాల‌యింది.


ఇక నార్త్ విష‌యానికి వ‌స్తే అల‌నాటి తార జ‌య‌ప్రద రాంపూర్ నుండి పోటీ చేయ‌గా ఆమె సైతం ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్ త‌ర‌పున నార్త్ ముంబై నుండి పోటీ చేసిన ఊర్మిళ‌ని కూడా ఓట‌మి ప‌ల‌క‌రించింది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, పూన‌మ్ సిన్హా, మిమీ చ‌క్ర‌వ‌ర్తి కూడా ఓడిపోయారు. అయితే రోజా( న‌గ‌రి) , బాల‌కృష్ణ (హిందూపూర్),సుమ‌ల‌త‌( క‌ర్ణాట‌క‌) , హేమ‌మాల‌ని( మ‌ధుర‌, బీజేపీ), స‌న్నీ డియోల్ ( గురుదాస్ పూర్, బీజేపీ), స్మృతి ఇరానీ ( అమేథి, బీజేపీ), కిర్ర‌న్ కేర్ ( చండీఘర్, బీజేపీ) విజ‌య‌కేతనం ఎగుర‌వేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: