వినుకొండ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట మాత్రమే కాదు. సుమారు 50000 పైగా కమ్మ సామాజికవర్గం ఉన్న స్థానం. మొన్నటివరకు జిల్లాలో ఎవరిని అడిగినా కానీ వినుకొండ అంటే టీడీపీ అన్నారు, ఇక్కడ సర్వేలు కూడా అవసరంలేదు టీడీపీ నే అని జిల్లాలోని వైసీపీ, ఇతర పార్టీ నాయకులు, జిల్లా ప్రజలు అనేవారు. ఇక్కడ కమ్మ సామజిక ఓట్లు 50వేల వరకు ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని గుంటూరు జిల్లా కుప్పం అనేవారు. మొన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా వైసిపికి అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తెలుగుదేశమే అని చెప్పారు.


ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న జి.వి ఆంజనేయులు జిల్లా అధ్యక్షులు. జిల్లాలోనే బలమైన నేత. 2009,2014 లో సుమారు 25వేల ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. కానీ ఈ సారి 29వేల మెజారిటీతో గత రికార్డులను, టీడీపీ ఇమేజ్ ని బద్దలు కొట్టింది. అంటే దాదాపు 50 వేల ఓట్లు మారినట్లు. ఇది ఎలా సాధ్యమైయింది అనేది ఎవరికీ అర్ధంకావటంలేదు. ఈ గెలుపుని జీర్ణించుకోలేని నియోజకవర్గంలోని చాలా మంది టీడీపీ అభిమానులు గత రెండు రోజులుగా ఇళ్లలో నుండి బయటకురావటంలేదు. జి.వి ఆంజనేయులు కూడా బాధను మరచిపోవటానికి దాదాపు మందులోనే ఉంటున్నారని, ఇంట్లో గ్లాసులు పగలుకొడుతున్నారు అని వాళ్ళ వల్లే చెబుతున్నారు.


ఇంత మెజారిటీ రావటం అనేది, జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న క్రేజ్ తో పాటు, ఇప్పుడు ఎమ్మెల్యేగా  గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడు గారి అబ్బాయి బొల్లా గిరిబాబు వ్యూహాలవల్లే ఇది సాధ్యం అయ్యింది అని మండల నాయకులు చెబుతున్నారు.  ఢిల్లీ లో రాజకీయ పాఠాలు చెప్పే ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకొని, పోల్ మానేజ్మెంట్ లో అనేక పుస్తకాలు చదివి, కొంత మంది మాజీ ఎమ్మెల్యేలతో ఎన్నికల వ్యూహాలమీద చర్చించి అనుభవం తెచ్చుకున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బొల్లాపల్లి మండల ఇంచార్జి గా బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీని బాగా పటిష్టం చేసారు. ఆ తరువాత అన్ని మండల మీద ఫోకస్ చేసి తనదైన వ్యూహాలతో ప్రత్యర్థిని బలంగా దెబ్బకొట్టారు. సొంత సామజిక వర్గంలోని యువత అంతా గిరిబాబుకి జై కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: