మోడీతో భేటీ తరువాత జగన్ గురించి మోడీ ట్వీట్ చేయడం ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో జగన్ కు ఉన్న ఇమేజ్ కు ఇది నిదర్శనమని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతా అని చెప్పుకొనే బాబు ఇప్పడు ఇంటికి పరిమితం అయితే జగన్ ఢిల్లీలో అసలైన చక్రం తిప్పుతున్నారు. మరోవైపు జగన్ తో భేటీ అనంతరం మోడీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.


జగన్ భేటీపై తెలుగులో ట్వీట్ చేసిన ఆయన.. భేటీని అద్భుతంగా అభివర్ణించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ అభివృద్ధి మీద ఫలవంతమైన చర్చ జరిపినట్లుగా పేర్కొన్నారు.సాధారణంగా మోడీ స్థాయి వ్యక్తుల్ని కలిసినప్పుడు.. ఆయనతో భేటీ అయిన వారు తమ మీటింగ్ జరిగిన తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్లు చేస్తుంటారు. దీనికి భిన్నంగా మోడీనే ట్వీట్ చేయటం ఒక ఎత్తు అయితే.. దాన్ని తెలుగులో చేయటం మరో ఎత్తు.


దీనంతటికి కొసమెరుపుగా ఆయన చేసిన ట్వీట్ గా చెప్పాలి. మోడీ చేసిన ట్వీట్ ను యథాతధంగా చూస్తే.. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయిన @ysjagan తో అద్భుతమైన సమావేశం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు  అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత  సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను" అని మోడీనే స్వయంగా చెప్పుకోవటం చాలా అరుదైన అంశంగా చెప్పాలి. ఢిల్లీలో జగన్ కు దక్కుతున్న ప్రయారిటీకి ఇదో నిదర్శనంగా చెప్పక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: