అతిత్వరలో సూపర్ స్టార్ మహేష్ మరియు అనిల్ రావిపూడిల కలయికలో సరిలేరు నీకెవ్వరు సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఇప్పటికే తన ఫిజిక్ ని జాగ్రత్తగా మెయింటేన్ చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతో విదేశాల్లో ఉన్న మహేష్ తిరిగిరాగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి కథ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ పలు కారణాలు కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్నాయి. 

అయితే ఆ విషయం అటుంచితే, ఈ సినిమాని అనిల్ పూర్తి స్థాయి వినోదాత్మకంగా చిత్రీకరించాలని సంకల్పించిన విషయం తెలిసిందే. అదికాక మహేష్ కూడా గత మూడు సినిమాలు మెసేజి ఓరియెంటెడ్ వి చేయడం వలన వాటిలో తాము ఆశించిన స్థాయి ఎంటర్టైన్మెంట్ లేదని మహేష్ ఫ్యాన్స్ కొద్దిరోజలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న అనిల్, ఈ సినిమాను పక్కా ఎంటర్టైనర్ గా తీయాలని నిర్ణయించారు. ఇకపోతే ఈ సినిమాలోని ఒక ప్రధాన కామెడీ ఎపిసోడ్ గురించి ఒక వార్త ప్రస్తుతం మీడియా వర్గాల్లో విపరీతమా వైరల్ అవుతోంది. 

అదేమిటంటే, గతంలో రవితేజ మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలోని ట్రైన్ కామెడీ ఎపిసోడ్ మాదిరి ఇందులో కూడా ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉందని, అయితే ఆ సీన్ సమయంలో హీరో, హీరోయిన్ ఫ్యామిలి ని కలవడం, వారి మధ్య జరిగే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. నిజానికి కామెడీ సీన్స్ తీయడంలో అనిల్ మంచి దిట్ట కావడంతో ఈ సినిమాలో కూడా కామెడీ అద్భుతంగా పండుతుందని చెప్పవచ్చు. అయితే దీనిలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని ఒకవేళ ఇది నిజమే అయితే మహేష్ ఫ్యాన్స్ కు ఇది ఒక పండుగలాంటి వార్త అనే చెప్పాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: