ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సభ ఏదైనా, మీటింగ్ ఏదైనా ప్రత్యేక హోదా నినాదం మాత్రం వదిలి పెట్టడం లేదు. అసలు  సందర్భం  కాకపోయినా జగన్ మోహన్  రెడ్డి ప్రత్యేకహోదా అంశం గురించినే మాట్లాడుతూ ఉండటం గమనార్హం. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ సందర్భంగా తన ప్రసంగంలో జగన్ మోహన్  రెడ్డి  ప్రత్యేకహోదా  అంశం గురించి ప్రస్తావించారు. వాస్తవానికి ఆ మీటింగ్ జరిపింది ఈ అంశాల గురించి చర్చకు కాదు.


దేశ వ్యాప్తంగా ఒకే సారి లోక్ - రాజ్యసభ ఎన్నికలు జరపడానికి - మహాత్మగాంధీ నూటా యాభైయవ జయంతి వేడుకల  నిర్వహణకు - తదితర అంశాల గురించి చర్చించడానికి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ప్రధానమంత్రి మోడీ - హోం శాఖ మంత్రి అమిత్ షా - కేంద్రమంత్రి రాజ్ నాథ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు - కేంద్రమంత్రులు అందరూ అక్కడే ఉండటంతో.. అక్కడ ప్రత్యేకహోదా ప్రస్తావన తీసుకొచ్చారు జగన్ మోహన్ రెడ్డి.

చట్టసభలకు బాధ్యత పెరగాలని - నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని - వ్యవస్థ నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా ప్రస్తావన తీసుకు వచ్చారు. నిజానికి మోడీ వ్యతిరేకంగా, ఇష్టం లేని అంశం గురించి పదే పదే ఏ సీఎం కూడా ప్రస్తావించారు. కానీ జగన్ ధైర్యానికి, తెగువకు మెచ్చుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: