టీడీపీ పార్టీకి సంక్షోభం కొత్త కాదని బాబాగారు పైకి అలా చెప్పొచ్చు.  కానీ ఇది అలాంటి ఇలాంటి సంక్షోభం కాదు. పార్టీ పెట్టి నప్పటినుంచి ఇలా సీనియర్ నాయకులు ముక్కుముడిగా వేరే పార్టీలోకి జంప్ అవటం అనేది ఆశ్చర్యకరమే. టీడీపీకి రాజ్యసభలో ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురు.. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు పార్టీ మారారు.


ఇక మిగిలింది కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి. వీరిద్దరికీ మహూర్తం కుదరలేదంతే.. వెళ్లడం కాస్త లేటవ్వచ్చేమో కానీ, వెళ్లడం మాత్రం పక్కా. ఆ లాంఛనం కూడా పూర్తయితే రాజ్యసభలో టీడీపీ స్కోర్ జీరో. ఇక లోక్ సభలో ముక్కుతూ మూలుగుతూ మూడు సీట్లు టీడీపీకి దక్కాయి. ఈ ముగ్గురివీ మూడు లోకాలు. ఇప్పటికే కేశినేని నాని బాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. ఆ వికెట్ ఎప్పుడు పడినా ఆశ్చర్యం లేదు.


వ్యాపారాల కోసం గల్లా జయదేవ్ ఎప్పుడంటే అప్పుడు పార్టీ మారతారు. ఇక రామ్మోహన్ నాయుడు పరిస్థితి తెలిసే ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఆ పదవి తీసుకున్నాక పార్టీ మారి టీడీపీని మరింత భ్రష్టుపట్టించాలనే ఆలోచనలో యువ ఎంపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీలే కాదు, ఇటు ఎమ్మెల్యేల పరిస్థికి కూడా అలానే ఉంది. ఐదుగురు ఎమ్మెల్యేలతో ఓ వర్గాన్ని ఏర్పాటుచేసిన గంటా, సోమవారం నుంచి చర్చలు ప్రారంభించబోతున్నారట. అంటే వచ్చేవారం ఏ నిమిషానైనా వీళ్లంతా జంప్ అన్నమాట. మొత్తమ్మీద చంద్రబాబు యూరప్ ట్రిప్ కి వెళ్లొచ్చే సరికి రాష్ట్రంలో పార్టీ ఖాళీ అవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: