కత్తి మహేష్ మళ్ళీ ట్విట్టర్ వేదికగా తన కత్తిని దూశాడు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేతపై కత్తి మహేశ్ విరుచుకుపడుతున్నారు. వరుస పోస్టులు పెడుతూ తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇప్పటికే ఎన్నో పోస్టులు పెట్టిన ఆయన.. తాజాగా చేసిన పోస్టు హాట్ టాపిక్ అవుతోంది. తన ఫేస్బుక్ ఖాతాలో ‘‘చంద్రబాబు అపర చాణుక్యుడో లేక చేతకాని చవటో తెలుగుదేశం పార్టీలోని కమ్మోళ్ళు డిసైడ్ చేసి చెప్పేస్తే - మా అనాలిసిస్ మేము చేసుకుంటాం’’ అంటూ ఆయన వివాదాస్పద పోస్టు ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది.


దీంతో దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులు - నాయకులు తెగ షేర్లు చేస్తున్నారు. ఇదే కాదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడంపైనా కత్తి మహేశ్ స్పందించారు. దీనిపై ఆయన వినూత్నంగా పోస్ట్ చేశారు. ‘‘తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు గంపగుత్తగా బీజేపీలోకి ఎందుకు వెళ్లారు?


1. చంద్రబాబే వాళ్ళని బీజేపీకి అమ్ముకున్నాడు.. 2. వాళ్ళవాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి - జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఎంపీలే వెళ్లారు.. 3. రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ వీళ్ళని ఆకర్షించింది.. 4. పైనున్నవి అన్నీ (మల్టిపుల్ ఛాయ్స్ ప్రశ్న - 5 మార్కులు). సమాధానం తెలిసీ చెప్పకపోతే - చంద్రబాబుతో పాటు మీరు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది’’ అని పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: