తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ చేయాలని అనుకున్న సన్మానాన్ని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరస్కరించారు.  జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పెద్దిరెడ్డి సీనియర్ అన్న సంగతి తెలిసిందే.  మంత్రయిన తర్వాత  చిత్తూరు జిల్లా లో పర్యటిస్తున్న పెద్దిరెడ్డికి వివిధ నియోజకవర్గాల్లోని నేతలు సన్మానాలు చేశారు.

 

ఆదివారం చిత్తూరులో జరిగిన జల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఆ సందర్భంగా టిడిపి సీనియర్ నేత, ఎంఎల్సీ దొరబాబు వేదిక మీదకు వచ్చి పెద్దిరెడ్డికి సన్మానం చేయాలని అనుకున్నారు. శాలువ కప్పేందుకు ప్రయత్నించినపుడు పెద్దిరెడ్డి తిరస్కరించారు. తనకు సన్మానం అవసరం లేదంటూ నిర్మొహమాటంగానే చెప్పారు.

 

నిజానికి పెద్దిరెడ్డి, దొరబాబు చాలా సంవత్సరాలుగా పరిచయస్తులే. పార్టీలు వేర్వేరైనా ఒకే జిల్లా కాబట్టి ఏదో ఒక సందర్భంలో తరచూ కలుస్తునే ఉంటారు. బహుశా ఆ చనువుతోనే దొరబాబు సన్మానం చేయాలని అనుకునుండొచ్చు. కారణం ఏదైనా కానీండా పెద్దిరెడ్డి మాత్రం సున్నితంగానే తిరస్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: