ఎపుడైనా, ఎక్కడైనా వ్యూహాలు ఉంటేనే వ్యవహారం సక్సెస్ అవుతుంది.  ఎక్కడ ఏది చేయాలో ఆ టైమింగ్ కూడా చాలా ముఖ్యం. లేకపోతే అసలు కుదరదు. అందుకోసం పక్కా స్క్రిప్ట్ అవసరం. దాన్ని అమలు చేసే గుండె ధైర్యం ఇంకా అవసరం.


అవన్నీ నిండుగా ఉన్నవారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.  అందుకే ఆయన పట్టుపట్టి మరీ ప్రజావేదికను కూలగొట్టేస్తున్నారు. అక్కడ పేరుకు ప్రభుత్వ భవనం కానీ టీడీపీ ఆఫీస్ గా వాడేసుకుంటున్నారు. దాంతో ఒక్క దెబ్బకు  ఈ పసుపు బంధాన్ని పుటుక్కుమనిపించారు జగన్. ముందుగా అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అన్నట్లు బాబు గారి సామాను అంతా బయటేయించారు.


ఆ తరువాత కలెక్లర్ల మీటింగ్ మొదలైన వెంటనే ప్రజావేదిక కూల్చేస్తామంటూ బాంబు పేల్చారు. అక్రమ  నిర్మాణాలకు దీనితోనే మొదలు కావాలి కూల్చడం అంటూ ప్రజావేదికను చూపించారు. దానికి ఎడా పెడా వాడేసిన టీడీపీ గుండెలు అవిసిపోగా, అదిరిపడగా గునపాలు పెట్టి మరీ పికిలించేసిన వైఖరి  సీఎం గా జగన్ కఠిన నిర్ణయాలను అమలు చేసే తీరును చెబుతుంది. రాజు అన్న వారు ఒక్కోసారి నియంతలా ఉంటే తప్ప ఎవరూ లొంగరు. అందుకే జగన్ లో ఇపుడు కొత్త కోణం చూస్తున్నారంతా. టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా. జగన్ రెండో వైపు చూస్తున్నారిపుడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: