చిత్తూర్ జిల్లా పేరుకు చంద్రబాబు స్వంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ ఎన్నికల్లో  టీడీపీకి వచ్చిన సీట్లు కేవలం 1 సీటు అది కూడా బాబు గారిదే. కుప్పంలో మాత్రమే టీడీపీ గెలవగా.. మొత్తం 13 సీట్లు వైసీపీ పరమైంది. ఇలా సొంత జిల్లాలోనే బాబుకు గట్టి షాకిచ్చారు జగన్.అయితే గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా ఇప్పుడు టీడీపీకి షాకిచ్చేందుకు రెడీ కావడం చంద్రబాబును ఆందోళన కు గురిచేస్తోంది.


ఓడిన ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నారని.. కింది స్థాయి కేడర్ అంతా వైసీపీలోకి క్యూ కట్టేందుకు రెడీ కావడం టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సొంత జిల్లాలో వలసలను అడ్డుకోవడానికి చంద్రబాబు ఏం చేస్తాడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తాజాగా జరిగిన చిత్తూరు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశానికి చాలా మంది ముఖ్యనేతలు తాజా ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరుకాకపోవడంతో టీడీపీ శిబిరం ఖంగుతింది.


చిత్తూరు ఎంపీగా టీడీపీ తరుఫున పోటీచేసిన శివప్రసాద్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేసిన పనబాక లక్ష్మీ రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసిన డీకే సత్యప్రభతోపాటు ఎమ్మెల్యేలుగా పోటీచేసిన శంకర్ యాదవ్ లలిత కుమారి గాలి భానుప్రకాష్ బొజ్జల సుధీర్ రెడ్డి హరికృష్ణ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ సర్వసభ్య సమావేశానికి దూరంగా ఉన్నారు.దీంతో వీళ్లలో ఎంతమంది బీజేపీలోకి జంప్ చేయబోతున్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరులో చిత్తూరు జిల్లాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయన్న సమాచారం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: