'వెంకయ్య నాయుడు' ఆంధ్రప్రదేశ్ నుండి  ఢిల్లీ స్థాయికి ఎదిగి.. ఏనాడూ వ్యక్తిగత లాభాల తప్ప  మరొక్క దాని గురించి ఆలోచించకుండా.. చివరికి ఆంధ్రుల ప్రత్యేక హోదాను కూడా విజయవంతంగా నీరు గార్చి   మొత్తానికి  పెద్ద మనిషిగా చలామణి అవుతున్న గొప్పోరు.  ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా పదవి వెలగబెడుతున్న మన వెంకయ్యగారికి జగన్ కోపం తెప్పించాడట.  తెలుగు రాష్ట్రాల్లోనే   పెద్ద దిక్కుగా ఉన్న తనను, కుర్రాడు జగన్ అవమానించాడని సన్నిహితుల దగ్గర చెప్పుకుని  ఏడిస్తే బాగోదని  దీనంగా మొహం పెట్టి మిక్కిలి చింతిస్తున్నాడట. 


ఇంతకీ విషయం ఏంటంటే.. జగన్ సీఎం అయ్యాక  ఢిల్లీ వెళ్లి.. బీజేపీ అగ్రనాయలందర్నీ కలిసి.. అక్కడే పక్క బిల్డింగ్ లో  ఉంటున్న తనను  కనీసం మాట వరసకైనా కలవకపోవడంతో  వెంకయ్యనాయుడుగోరి ఇగో హర్ట్ అయిందట. అయితే జగన్ వెంకయ్యను కావాలనే  పక్కన పెట్టాడట. రాష్ట్రం వల్ల  వెంకయ్యకి తప్ప, వెంకయ్య వల్ల రాష్ట్రానికి ఏనాడూ చిన్న మేలు జరగలేదని.. అలాంటి వ్యక్తికి కనీస గౌరవం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని  జగన్ తన మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది.  నిజానికి జగన్ చెప్పిందే నిజమే.  తన పదవి కోసం,  బీజేపీ పార్టీ కోసం మన వెంకయ్యగోరు  మన తెలుగు ప్రజల హక్కులను కూడా కాజేశారు.  


పైగా మన బాబుగోరికి - వెంకయ్యగోరికి మధ్య అబ్బో  అదొక గొప్ప స్నేహం ఉందిలేండి.  బాబుగోరి  కోసం  ఓ దశలో  వెంకయ్యగోరు ఏపీలో  ఏకంగా బీజేపీ పార్టీనే పూర్తిగా ముంచెయ్యటానికి  బాగా కష్టపడ్డాడు.  కాకపోతే ఇలా ముంచడంలో ఎప్పుడో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన మోడీగోరు  వెంకయ్య నైజం పసిగట్టి  వెంకయ్యకి ఉపయోగపడని ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి  పక్కన పడేసిండు... పాపం వెంకయ్య.   


మరింత సమాచారం తెలుసుకోండి: