వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తుతం ట్విట్ స్టార్ అయిపోరు. టీడీపీ నాయకులను రోజుకో ఒక ప్రశ్నతో గడగడలాడిస్తున్నారు విజయసాయి రెడ్డి. ఎన్నికల ముందు వరుకు అధికారంలో ఉన్న చంద్రబాబుని ముప్పుతిప్పలు పెట్టిన విజయసాయి రెడ్డి, వైసీపీ అధికారంలోకి రాగానే ఇంకాస్త డోస్ పెంచి చంద్రబాబుకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. విజయసాయి రెడ్డి ట్విట్ల ప్రశ్నలకు నెటిజన్లు కూడా మంచి రెస్పాస్ అందిస్తున్నారు అనుకోండి. 


అయితే తాజాగా విజయసాయి రెడ్డి, చంద్రబాబుపై మరో కామెంట్ పోస్ట్ చేసారు. మరుగుదొడ్ల నిర్మాణం గురించి ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. పేద కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా మీ పార్టీ నేతలు మింగేశారే అంటూ ట్విట్ చేసారు. మీ నివాసం, మంత్రుల ఇళ్లలో ఒక్కో టాయిలెట్ రెనోవేషన్ పనులకు 7 నుంచి 9 లక్షలు ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించారు. చివరకు దొడ్లను కూడా వదిలి పెట్టలేదు కదా చంద్రబాబు గారూ? అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు 'మీది ఒక బతుకేనా చంద్రబాబు గారు.ఆఖరికి ఇలాంటి కక్కుర్తి పనులు చేయడానికి కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా మీకు' అని ఒకరు, మరొకరు 'సర్ టాయిలెట్ లొనే పడుకుంటాడేమో అక్కడే తింటాడేమో అందుకే 9 లక్షలు ఖర్చుపెట్టి మరమ్మత్తులు చూపించాడు. అదే 9 లక్షలు పేద ప్రజలకు ఇచ్చింటే 3 కుటుంబాలు ఇళ్ళు కట్టుకొని సంతోషం గా ఉండేవాళ్ళు' అంటూ చంద్రబాబుపై విరుచుకు పడుతూ ట్విట్ చేసారు నెటిజన్లు. అయితే ఈ ట్విట్ కి చంద్రబాబు నాయుడు, నారాలోకేష్, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: