రాజకీయ చాణక్యుడు చంద్రబాబు అని చెబుతూంటారు.   ఆయన ఆవలించకుండా పేగులు లెక్కబెడతారని కూడా అంటారు. బాబు ఇవాళా రేపు చూడరు పదేళ్ళు ముందు ఆలోచిస్తారని కూడా అంటారు. దేశంలోని  సీనియర్ నేత చంద్రబాబు.  ఆయనకు తెలియనిది రాజకీయాల్లో అసలు ఉండదంటే ఉండదు.



మరి చంద్రబాబుకు ఓ విషయం గత నెల్లరన్నర రోజులుగా అర్ధం కావడం లేదు. అదేంటి అంటే ఏపీలో నన్నెందుకు జనం ఓడించారు. టీడీపీకి 23 ఎమ్మెల్యేలే ఎందుకు ఇచ్చారు. దానికి బీజేపీ వద్ద సమాధానం ఉంది    ప్రదాని మోడీని దూషించిన టిడిపిని ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి,బిజెపి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్  అన్నారు టీడిపి అదినేత చంద్రబాబు నాయుడుపై   ఆయన  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. . 2014 లో బిజెపి పొత్తువల్లే గెలిచిందని ఆయన అన్నారు.మోడీని ఓడిస్తామని బీరాలు పోయిన నేతలంతా సెలవులపై విదేశీయాత్రలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.


తిరుపతిలో ఆయన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆరంబించారు.మోదీని ఓడించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న నేతలను, పార్టీలను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. అంటే మోడీని తిట్టినందుకే ఏపీలో టీడీపీని జనం ఓడించారని జవదేకర్ చెబుతున్నారు. మరి ఇంత చిన్న విషయం బాబుకు అర్ధం కాలేదా. అర్ధం అయింది కాబట్టే కేంద్ర బడ్జెట్ పై మోడీని తిట్టకుండా బాబు జాగ్రత్త పడారని తమ్ముళ్ళు అంటున్నరు. మరి ఎందుకు ఓడించారో అని అడుగుతున్నారంటే అదంతా జనాలను మభ్యపెట్టేందుకేనట. 


మరింత సమాచారం తెలుసుకోండి: