అధికారంలోకి నెల రోజులు కూడా కాలేదు. అపుడే జగన్ సర్కార్ ఫెయిల్ అయిందని ఆరోపణలు చేస్తూ లేని పోని దీర్ఘాలు తీస్తూ హడావుడి చేస్తున్న చంద్రబాబు అండ్ కో కు తన సొంత జిల్లా కడప గడప నుంచే జగన్ తిరుగులేని జవాబు ఇచ్చారు. బాబు అయిదేళ్ల అద్వాన్న పాలనను మరో మారు ఏకి పారేశారు.


రైతులను అన్ని విధాలుగా మోసం చెసినా మీరా మాకు చెప్పేది అంటూ జమ్మలమడుగు సభలో జగన్ చేసిన ప్రసంగం చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళకకు షాక్ ఇచ్చేదే. విత్తనాలు రైతులకు ఇవ్వలేని సర్కార్ అంటూ చంద్రబాబే నేరుగా జగన్ని టార్గెట్ చేశారు. దానికి జగన్ బదులిస్తూ అదంతా మీ నిర్వాకమే అంటూ ఆధారసహితంగా కడిగిపారేశారు.


గత నవంబర్  నుంచి మొదలుపెట్టాల్సిన విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని అటక్కించడమే కాదు, విత్తనాల సరఫరాకు  విడుదల చేయాల్సిన 384 కోట్ల రూపాయలను కూడా ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని జగన్ ఆరోపించారు. ఇక గత ఖరీఫ్ లో బాబు సర్కార్ రైతులకు ఇచ్చిన విత్తనాల కంటే ఒక్క నెల రోజుల్లోనే ఎక్కువగా ఇస్తున్నట్లుగా జగన్ చెప్పుకున్నారు.


జగన్ ప్రసంగంలో రైతుల గురించి  ఎన్నో వరాలు కురిపించారు. అలాగే సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్, ఇతర ప్రాజెక్ట్ పనులను కూడా ఈ ఏడాది డిసేంబర్ 26న ప్రారంభిస్తామని జగన్ ప్రకటించారు. మొత్తానికి జగన్ కడప నుంచే  టీడీపీ తనపై చేస్త్తున్న గాలి ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: