అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తొందరలో టిడిపి బలం 13 సీట్లకు పడిపోతుందని జోస్యం చెప్పారు. సున్నావడ్డీపై చర్చ జరుగుతున్న సమయంలో జగన్ స్పీచ్ కు టిడిపి సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. జగన్ మాట్లాడుతున్నపుడు టిడిపి ఎంఎల్ఏలు రన్నింగ్ కామెంటరీ ఇస్తునే ఉన్నారు.

 

అంతకుముందు చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నంత సేపు జగన్ తో పాటు వైసిపి సభ్యులు ఓపిగ్గానే విన్నారు. అదే జగన్ ప్రసంగం మొదలుపెట్టగానే టిడిపి సభ్యులు అరుపులు, కేకలు మొదలుపెట్టారు. దాంతో విసుగొచ్చిన జగన్ టిడిపి సభ్యులపై విసుక్కున్నారు. రాద్దాంతం చేయకుండా వినమన్నారు. తమ సీట్లలో నుండి లేచి గోల చేస్తున్న ఎంఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడకుండా కూర్చోమని పదే పదే జగన్ చెప్పినా వినలేదు.

 

నిజానికి టిడిపి అడిగిన పద్దతిలో సభలో చర్చకు అనుమించాల్సిన అవసరం లేదు అధికారపార్టీకి. కానీ అంశానికున్న ప్రాధాన్యత దృష్ట్యా జగనే చర్చకు అనుమించారు. దాంతో చర్చ కాస్త గందరగోళానికి దారితీసింది. దాంతో విసిగిపోయిన జగన్ టిడిపి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇపుడున్న 23 మంది ఎంఎల్ఏల బలం 13కి పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: