ఈ మధ్య ఏమైందో కాని లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా బాగా రెచ్చిపోతున్నారు. కానీ లోకేష్ ను వైసీపీ అధినేత జగన్ అసలు పట్టించుకోవటం లేదు. అయితే తాజాగా బడ్జెట్ నేపథ్యంలో లోకేశ్ మరో ట్వీట్ వదిలారు. అమ్మ ఒడి పథకంలో లబ్ది పొందే తల్లుల సంఖ్యను సగానికి సగం తగ్గించడం సరికాదని విమర్శించారు. "ఒక తల్లికి ఇవ్వడమేంటి? మరో తల్లికి ఇవ్వకపోవడం ఏంటి?


ఆ విధంగా స్కిప్ చేసుకుంటూ పోయి జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? ఎలాగూ పథకాలకు మీ పేర్లు పెట్టుకుని మురిసిపోతున్నారు కదా! ఈ పథకానికి 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెట్టుకుంటే సరిపోయేది అంటూ సెటైర్ వేశారు.బడ్జెట్లో గృహనిర్మాణాలకు కేవలం రూ.8,165 కోట్లు ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.


గృహనిర్మాణాలకు బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే ఇల్లు కడతారా పిచ్చుకగూళ్లు కడతారా అన్న అనుమానం కలుగుతోందని లోకేశ్ మళ్లీ పంచ్ వేశారు. అక్కడితో ఆగని లోకేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా వెనుక ఉన్న శ్రీకాంత్ రెడ్డి కునుకు తీస్తున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: