ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పోరాటమైన చేస్తారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం కచ్చితంగా ఆంధ్రకు కచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తుందని, ప్రత్యేక హోదా సాధించేవారుకూ వైసీపీ పోరాటం చేస్తుందని అయన అన్నారు.  


కాకినాడలో మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక హోదా ఏపీ ప్రజల సంజీవని అని స్పష్టం చేశారు. కేంద్రం ప్రత్యేక హోదాను ఇస్తుందని వారు భావిస్తున్నట్టు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం తొలిసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది అని అన్నారు. 


కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని పాదయాత్రలోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జాగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ తొలి బడ్జెట్ లోనే తమ ప్రభుత్వం కాపులకు 2 వేళా కోట్లు కేటాయించిందని అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అనవసరంగా ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాగా తుని రైలు దహనం ఘటనలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: