కొన్ని రోజుల నుంచి అసెంబ్లీలో జగన్ మాట తీరు గురించి సోషల్ మీడియాలో ఒక సామజిక వర్గం వారు బాగా రెచ్చిపోతున్నారు. ఇంతకీ జగన్ అసెంబ్లీలో ఆవేశపడ్డారా లేక ఆయన్ని రెచ్చగొట్టారా అనేదే ఇక్కడ ప్రశ్న. అధికారం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు జగన్ ని చూసిన వారెవరికైనా అసెంబ్లీలో ఆయన మాట తీరుచూసి ఆశ్చర్యం కలగకమానదు. అయితే సభ సజావుగా సాగనీయక పోవడం వల్లే సీఎం జగన్ లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గొంతులు నొక్కారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, అయినా మీ రుబాబు ఏంటి అని ప్రశ్నించారు జగన్.


అయితే మామూలుగా చెబితే పచ్చ బ్యాచ్ కి ఎక్కదు కదా. అందులోనూ చంద్రబాబు తనది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఊరికే కోతలు కోస్తుంటారు. నా అనుభవమంత లేదు నీ వయసు అంటూ జగన్ ని మాటి మాటికీ రెచ్చగొడుతున్నారు. ఈనేపథ్యంలోనే జగన్ మాట కాస్త కటువుగా మారింది. బడ్జెట్ ప్రసంగానికి మాటి మాటికీ అడ్డుతగులుతుండే సరికి కూర్చోవయ్యా కూర్చో అని అన్నారే కానీ, బయటకి వెళ్లవయ్యా అని అనలేదు.


అడ్డుతగిలే వాళ్లని ఆమాత్రం అదిలించకపోతే కష్టమే. అందులోనూ కాస్త అవకాశమిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఊరుకుంటారా. అందుకే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని జగన్ టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ ప్రసంగాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, షేర్లు కొట్టి, కామెంట్లు పెట్టినవారంతా ఓ సామాజిక వర్గానికి చెందిన వారనేది స్పష్టమైంది. పార్టీ పగతోపాటు, ఆ సామాజిక వర్గ వైరం కూడా దీనికి ఆజ్యంపోసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: