తెలుగుదేశం పార్టీ నేతలు ట్విట్టర్ వేధికగా వారి పరువు వారే తీసుకుంటున్నారు. అస్సలు ఎందుకో కానీ వారి పరువుని వారే తీసుకుంటున్నారు. వాళ్ళు ట్విట్టర్ వేధికగా చేసే విమర్శలు వాళ్లకు వ్యక్తిగత కక్షలు ఉన్నాయి ఏమో అనే డౌట్ ని తెప్పిస్తున్నాయి. ఆదివారం అని కూడా లేకుండా ట్విట్టర్ వేధికగా తెలుగుదేశం పార్టీ పరువుని తీస్తున్నారు కేశినేని నాని, బుద్దవెంకన్న. 


ఉదయం నాలుగు పదాలు రానివాడు కూడా ట్విట్ చేస్తున్నాడు అంటూ మొదలైన ఈ ట్విట్ వార్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. కేశినేని నాని, బుద్ధా వెంకన్న ఒకరికొకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఒకరిపై ఒకరు గోరంగా ట్విట్ చేసుకున్నారు. 


కేశినేని నాని ట్విట్ చేస్తూ 'రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు తనకు అవసరం లేదని, ఇలాంటి వన్నీ గుళ్ళో కొబ్బరి చిప్పల దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి పదవులు అవసరమని అన్నారు'. కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చెయ్యడంతో కేశినేని ట్రావెల్స్ పుట్టుపూర్వోత్తరాల గురించి ట్విట్టర్ వేదికగా బయట పెట్టారు. 


బుద్ధా వెంకన్న ట్విట్ 'నువ్వు చేసినవన్నీ అభాంఢాలు, నేను చెప్పేవన్నీ నిజాలు, బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు cheet చేసిన నువ్వా Tweet చేసేది' అని కాసేపు ఆగి 'దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు, ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా, నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా? అంటూ కేశినేని నాని నోరు మూశారు బుద్ధ వెంకన్న. ఒకే పార్టీ అయి ఉండి విమర్శలు చేసుకున్న ఈ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: