భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన  చంద్రయాన్‌-1 ద్వారా చంద్రుని మీద నీటిజాడలు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పిన ఇస్రో.. సోమవారం తెల్లవారుఝామున మరింత సమాచారం కోసమే చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే.   శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్‌–2ను ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2లో సాంకేతిక సమస్యల ఏర్పడటంతో ప్రయోగం వాయిదా పడింది. 19 గంటల 4 నిమిషాల 36 సెకన్లపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగింది. అయితే ప్రయోగానికి ఇంకా 56 నిమిషాల 24 సెకన్లు ఉండగా సాంకేతిక లోపాలతో కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. క్రయోజనిక్‌ స్టేజ్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల ప్రయోగాన్ని ఆపినట్లు, తదుపరి ప్రయోగ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో అధికారప్రతినిధి గురుప్రసాద్‌ ప్రకటించారు.

ఈసారి ప్రత్యేకంగా ప్రగ్యాన్‌ అనే రోవర్‌ను 14 రోజుల పాటు చంద్రుని మీద 500 మీటర్ల వరకు సంచరించలా చేస్తారు. అది మనకు చంద్రుని గురించిన కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు రోవర్‌లను పంపాయి. వాహకనౌక అయిన ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: