ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు యొక్క సర్కారూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర్ట్రంలో సర్కారీ మద్యం షాపులను ప్రారంభించాలని అనుకుంటుంది. ఈ మేరకు సరికొత్త మద్యం విధానాన్ని ప్రకటించనుంది. ఈ సర్కారీ మద్యం షాపుల్లో ఒక్కో షాపులో నలుగురు యువతకు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇందుకోసం కొత్త మద్యం పాలసీని ప్రబుత్వం ప్రకటించబోనుంది. కొత్త మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తుంది.


నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూన్ నెలాఖరుతో మద్యం షాపుల గడువు ముగిసింది. కాని కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, మద్యం పాలసీ రూపొందించటంలో జాప్యంతో మద్యం షాపులకు మరో మూడు నెలలు గడువు పెంచారు. కానీ షాపుల సంఖ్యను కుదించారు. ప్రస్తుతం నూతన మధ్యం విధానం తయారు చేయడంలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.


మద్యం పాలసీ విధానంలో సరికొత్త సంస్కరణలు తీసుకురావడం ద్వారా దశల వారీగా మద్యం నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఏటా 25 శాతం మధ్యం దుకాణాలు తగ్గించాలని నిర్ణయించింది. మూడు నెలల పాటు షాపుల నిర్వాహణ గడువు పెంచినా, వాటి సంఖ్య మాత్రం ఇప్పటికే తగ్గించారు.
సాయంత్రం ఆరు గంటలు దాటితే మద్యం విక్రయాలను నిలిపి వేయాలని కూడా నిర్ణయించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా కొత్త కొత్త ఆంక్షలను, నిబంధనలను విధించడం ద్వారా మద్యం నిషేదం వైపు ప్రభుత్వం అడుగులేస్తోంది.


ఒక్కో మద్యం షాపులో ముగ్గురు సేల్స్ మెన్లు, ఒక సూపర్ వైజర్ ను నియమించాలని ఎక్పైజ్ శాఖ ప్రతిపాదనలు పంపించింది. మద్యం షాపులో సూపర్ వైజర్ గా పనిచేసే వ్యక్తి నుంచి డిపాజిట్ సేకరించనున్నారు. షాపు ఆర్థిక లావాదేవీలన్నింటికీ సూపర్ వైజర్ నే బాధ్యుడుగా చేయనున్నారు. వీరు జీత భత్యాలు మరియు ఇతరత్రా అలవెన్సుల విషయం పై ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.ప్రభుత్వ మద్యం దుకాణాలు పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉన్నాయి. అదే విధంగా అక్కడ విధానమే మన రాష్ట్రంలో అమలు చేయాలన్నది ప్రభుత్వ భావిస్తోంది. ఈ విధానం అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమలు చేయడానికి యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.


దుకాణానికి వచ్చిన నిల్వ,విక్రయాలలో తేడా ఉంటే పనిచేసే సిబ్బందిపై కఠిన చర్యలకు ఉపక్రమించనున్నారు.తద్వారా బెల్టు షాపులు, లూజు విక్రయాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం వల్ల ఎక్సైజ్, అబ్కారీ శాఖపై అదనపు భారం పడనున్నట్లు అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: