తెలంగాణ లో   కాంగ్రెస్ నుండి వలసలు మొదలయ్యయని అనిపిస్తొంది.  కొండా మురళి, కొండా సురేఖ దంపతులు బిజెపిలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుండి వీరు 2014 ఎన్నికల సమయంలో వీరు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరారు.
 మళ్లీ 2019  ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ లోకి వెళ్లారు.  రాజకీయ భవిష్యత్ కోసం బిజెపిలో చేరాలని వీరు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
బిజెపిలో చేరడానికి తమ కూతురుకి భూపాలపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే షరతును కొండా దంపతులు  అధిష్ఠానాన్ని కోరినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ ఓడిపోయారు. 
అయితే గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బిజెపిలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కొండా దంపతులతో పాటు గండ్ర కూడా భూపాలపల్లి టికెట్ కోరుతుండడంతో వల్ల తమ పార్టీలో కొంత అయోమయం నెలకొన్నట్టు బీజేపీ సమాచరం.



మరింత సమాచారం తెలుసుకోండి: